Rudravaram: విలీనం మిగిల్చిన ఈ ఇద్దరు!
ABN, First Publish Date - 2022-10-27T15:01:52+05:30
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని తుమ్మలకొట్టాల ప్రాథమిక పాఠశాలలో ఇద్దరే విద్యార్థినులు మిగిలారు. ఉపాధ్యాయుడు జాకబ్ ఈ ఇద్దరికి విద్యాబోధన చేస్తున్నారు. 3, 4, 5 తరగతులను ఎల్లావత్తుల ఉన్నత పాఠశాలలో
రుద్రవరం: నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని తుమ్మలకొట్టాల ప్రాథమిక పాఠశాలలో ఇద్దరే విద్యార్థినులు మిగిలారు. ఉపాధ్యాయుడు జాకబ్ ఈ ఇద్దరికి విద్యాబోధన చేస్తున్నారు. 3, 4, 5 తరగతులను ఎల్లావత్తుల ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో నలుగురు విద్యార్థులు ఆ పాఠశాలకు వెళ్లారు. మరో నలుగురు విద్యార్థులు వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. చివరకు ఒకటో తరగతిలో పూజిత, రెండో తరగతిలో తేజస్విని మాత్రమే మిగిలారు. ఉపాధ్యాయుడు జాకబ్ మాట్లాడుతూ తనకు కూడా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి వచ్చిందని, త్వరలో ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-10-27T15:05:43+05:30 IST