చదువుకునే చోటు లేదు.. పుస్తకాలు లేవు
ABN, First Publish Date - 2022-08-09T20:10:09+05:30
చదువుకునేందుకు చోటు లేదు.. పుస్తకాలు లేవు.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరు.. పసిపిల్లల ప్రాణాలకు భరోసా లేదు’’ అని టీపీపీసీ అధ్యక్షుడు
రాష్ట్రంలో పాఠశాలల దుస్థితి ఇదీ.. రేవంత్ ట్వీట్
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ‘‘చదువుకునేందుకు చోటు లేదు.. పుస్తకాలు లేవు.. పాఠాలు చెప్పేందుకు గురువులు లేరు.. పసిపిల్లల ప్రాణాలకు భరోసా లేదు’’ అని టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. ఉద్యమ ద్రోహి పాలనలో పైలం బిడ్డో.. అని బడికి పంపే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. శిథిల భవనాలు, చాలీచాలని తరగతి గదులు, సరిపడా లేని టీచర్లు, నాణ్యత లేని భోజనం, సౌకర్యాల లేమి, ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం.. ఇదీ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అచ్చంపేట నియోజకవర్గం తాగపూర్ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై ట్విటర్లో ఆయన వీడియో పోస్టు చేశారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి సబిత ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా బడుల దుస్థితిపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారించనుందని పేర్కొన్నారు.
Updated Date - 2022-08-09T20:10:09+05:30 IST