సర్కారు బడిలో ఐఏఎస్ పిల్లలు
ABN, First Publish Date - 2022-07-06T17:44:36+05:30
రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ ప్రభాకర్రెడ్డి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. ఆయన కుమార్తె 8వ తరగతి
అడ్మిషన్ తీసుకున్న శాప్ ఎండీ ప్రభాకర్రెడ్డి
విజయవాడ, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ ప్రభాకర్రెడ్డి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. ఆయన కుమార్తె 8వ తరగతి, కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నిర్ణయించా రు. పటమటలోని జిల్లాపరిషత్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో వారిని చేర్పించడానికి ప్రభాకర్రెడ్డి సతీమణి లక్ష్మి మంగళవారం అడ్మిషన్ తీసుకున్నారు. బుధవారం వారిని పాఠశాలలో చేర్పిస్తారు. ప్రభాకర్రెడ్డి ఇంతకుముందు నెల్లూరు జిల్లా జేసీగా పనిచేశారు.
Updated Date - 2022-07-06T17:44:36+05:30 IST