బడిలో భయం భయం
ABN, First Publish Date - 2022-08-04T20:40:44+05:30
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవంతి శిథిలావస్థకు చేరింది
చెన్నేకొత్తపల్లి: శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవంతి శిథిలావస్థకు చేరింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడ 33 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇద్దరు టీచర్లు ఉన్నారు. ప్రస్తుతం అన్ని తరగతుల వారినీ ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. భవంతి పైకప్పు పెచ్చులూడి దెబ్బతింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పైకప్పు నుంచి నీరు కారుతోంది. అలాగే, పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
Updated Date - 2022-08-04T20:40:44+05:30 IST