NEET PG నోటిఫికేషన్ విడుదల
ABN, First Publish Date - 2022-01-18T21:32:06+05:30
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ - నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ - పీజీ) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ - నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ - పీజీ) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ, ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మే 31 నాటికి ఏడాది వ్యవధిగల ఇంటర్న్షిప్ పూర్తిచేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.
నీట్ పీజీ వివరాలు: ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్. దీనిని సీబీటీ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే ఇస్తారు. ఈ పరీక్షలో అర్హత పొందాలంటే జనరల్ అభ్యర్థులకు కనీసం 50 శాతం మార్కులు రావాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.4250; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3250
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 4
అడ్మిట్ కార్డ్ల డౌన్లోడింగ్: మార్చి 7 నుంచి
నీట్ పీజీ 2022 తేదీ: మార్చి 12
ఫలితాలు విడుదల: మార్చి 31
వెబ్సైట్: https://nbe.edu.in
Updated Date - 2022-01-18T21:32:06+05:30 IST