వలస కార్మికుల పిల్లలు విద్యలో రాణించాలి
ABN, First Publish Date - 2022-01-11T21:30:44+05:30
వలస కార్మికుల పిల్లలు విద్యలో రాణించాలని జిల్లా స్ర్తీశిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. మం డల పరిధిలోని
చౌటుప్పల్ రూరల్, జనవరి 10: వలస కార్మికుల పిల్లలు విద్యలో రాణించాలని జిల్లా స్ర్తీశిశు సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి అన్నారు. మం డల పరిధిలోని పెద్దకొండూర్లో గల ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు సోమవారం కలెక్టర్ పమేలా సత్పథి సమకూర్చిన నోటుబుక్స్, పెన్నులు, దుప్పట్లు, బ్యాగులను అందజేశారు. ఈ సందర్భం గా కృష్ణవేణి మాట్లాడుతూ కలెక్టర్ మానవతా దృక్పథంతో వలస కార్మికు ల పిల్లలకు చేయూత అందిస్తున్నారని తెలిపారు. అట్టడుగున ఉన్న వలస కార్మికుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూ తనందించాలని కోరారు. బాలలకు ఎలాంటి సమస్య వచ్చినా బాలరక్షక్ వాహనాన్ని ఉపయోగించుకోవాలని, 1098కు కాల్ చేయాలని సూచించా రు. కార్యక్రమంలో సర్పంచ్ కాయితి రమే్షగౌడ్, డీసీపీవో సైదులు, జోస ఫ్, శైలజ, కుమారస్వామి, కొండపనాయుడు, మాధవరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-11T21:30:44+05:30 IST