హామీల సాధనకు సువర్ణావకాశం!
ABN, First Publish Date - 2022-06-17T06:18:56+05:30
రాష్ట్ర విభజనలో అన్ని విధాల నష్టం జరిగిన నేపథ్యంలో, హామీల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామని ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి...
రాష్ట్ర విభజనలో అన్ని విధాల నష్టం జరిగిన నేపథ్యంలో, హామీల సాధనకు రాజీ లేని పోరాటం చేస్తామని ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నందున ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. అయినా కేంద్రం తీసుకువస్తున్న బిల్లులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని వ్యతిరేకిస్తే హామీలన్నీ సాధించవచ్చని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సూచన చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు. సీఎం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి.
కంభంపాటి కోటేశ్వర రావు
Updated Date - 2022-06-17T06:18:56+05:30 IST