ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణంలోనూ వీడని బంధం

ABN, First Publish Date - 2022-06-08T15:31:29+05:30

భర్త మృతి తట్టుకోలేని భార్య మృతిచెందిన ఘటన తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. అంబాసముద్రం సమీపం విక్రమసింగపురం ప్రాంతానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 7: భర్త మృతి తట్టుకోలేని భార్య మృతిచెందిన ఘటన తిరునల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. అంబాసముద్రం సమీపం విక్రమసింగపురం ప్రాంతానికి చెందిన సౌందర్‌రాజన్‌ (72) ఓ ప్రైవేటు మిల్లులో పనిచేసి పదవీవిరమణ పొందారు. సౌందర్‌రాజన్‌ సోమవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుకు గురవడంతో బంధువులు అతడిని అంబాసముద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు తిరునల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య అళగుతిరుమలై ముత్తమ్మాళ్‌ భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మంగళవారం ఉదయం మృతిచెందింది. భార్యాభర్తలు 12 గంటల వ్యవధిలో మృతిచెందడం ఆ ప్రాంతంలో విషాదం నింపింది.

Updated Date - 2022-06-08T15:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising