ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనం నీటిగుంటలోపడి దంపతుల మృతి

ABN, First Publish Date - 2022-03-20T18:54:30+05:30

తిరువణ్ణామలై జిల్లా సెంజి సమీపంలో దేవికాపురం అనే ప్రాంతం వద్ద ద్విచక్రవాహనం నీటిగుంటలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో నాలుగు నెలల గర్భంతో ఉన్న భార్య,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): తిరువణ్ణామలై జిల్లా సెంజి సమీపంలో దేవికాపురం అనే ప్రాంతం వద్ద ద్విచక్రవాహనం నీటిగుంటలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో నాలుగు నెలల గర్భంతో ఉన్న భార్య, ఆమె భర్త దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. జిల్లాలోని ఆత్తూరు గ్రామానికి చెందిన శక్తి (35), ఆయన భార్య సుకన్య (27)లు ద్విచక్రవాహనంపై ఎదప్పట్టిలో ఉన్న ఒక మెడికల్‌ షాపుకు వెళ్ళారు. అక్కడ తమకు కావాల్సిన మందులను కొనుగోలు చేసుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో దేవికాపురం అనే ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న ఒక నీటి గుంటలోకి దిచక్రవాహనం దూసుకెళ్ళింది. వీరిద్దరూ నీటి గంట నుంచి బయటపడలేక ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బంది సాయంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఒకే సమయంలో గర్భిణి, ఆమె భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆత్తూరు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. 

Updated Date - 2022-03-20T18:54:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising