ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సుపై పడిన ఇనుపకమ్మీలు..

ABN, First Publish Date - 2022-09-28T14:29:25+05:30

స్థానిక రామాపురంలో మంగళవారం వేకువజాము మెట్రోరైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇనుప కమ్మీలు క్రేన్‌ నుంచి జారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - ఇద్దరు డ్రైవర్లు సహా ముగ్గురికి గాయాలు


చెన్నై, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక రామాపురంలో మంగళవారం వేకువజాము మెట్రోరైలు మార్గం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇనుప కమ్మీలు క్రేన్‌ నుంచి జారి సిటీ బస్సు పై పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీని కార ణంగా గంటకు పైగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రామాపురం పూందమల్లి హైవే మధ్య మెట్రోరైలు మార్గం కోసం ఫ్లైఓవర్‌ స్తంభాల కాంక్రీటు పనులు జరుగుతున్నాయి.ఆ మేరకు ఆ ప్రాంతంలో మంగళవారం వేకువజామున ఇనుపకమ్మీలను భారీ క్రేన్‌ ద్వారా నిలబెడుతున్న సమయంలో ఊహించని విధంగా ఆ కమ్మీలు జారి, కుండ్రత్తూరు నుంచి ఆలందూరు డిపోకు రవాణా సిబ్బందిని తీసుకెళుతున్న సిటీ బస్సుపై పడింది. ఆ కమ్మీల బరువుకు బస్సు పైకప్పు నుజ్జు నుజ్జయింది. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్‌ అయ్యాదురై (52), మరో డ్రైవర్‌ భూపాలన్‌ (45), కంటైనర్‌ లారీ డ్రైవర్‌ రంజిత్‌కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే పాండీబజార్‌ ట్రాఫిక్‌  పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరించారు. ఆ తరావ్త బస్సుపై పడిన ఇనుపకమ్మీలను తొలగించే పనులు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రహదారిలో గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2022-09-28T14:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising