ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో వరుడు, తల్లి దుర్మరణం

ABN, First Publish Date - 2022-02-17T16:04:44+05:30

కోయంబత్తూరు సిడ్కోనగర్‌ వద్ద బుధవారం ఉదయం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వరుడు, అతడి తల్లి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు సుందరాపురానికి చెందిన సౌడయ్యన్‌, మంజుల దంపతుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోయంబత్తూరు సిడ్కోనగర్‌ వద్ద బుధవారం ఉదయం కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వరుడు, అతడి తల్లి మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు సుందరాపురానికి చెందిన సౌడయ్యన్‌, మంజుల దంపతుల కుమారుడు శ్యామ్‌ ప్రసాద్‌కు తేని జిల్లా బోడియనాయకనూరుకు చెందిన స్వాతి అనే యువతితో మూడు రోజులకు ముందు వివాహం జరిగింది. మూడు నిద్రల తర్వాత శ్యామ్‌ ప్రసాద్‌ భార్య స్వాతి, తల్లిదండ్రులతో కారులో బోడినాయకనూరులోని అత్తగారింటికి బుధవారం వేకువజామున కారులో బయలుదేరారు. కారును శ్యామ్‌ ప్రసాద్‌ నడిపాడు. ఆ కారు సిడ్కోనగర్‌ రహదారిలో వెళుతుండగా అదుపు తప్పిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యామ్‌ ప్రసాద్‌, అతడి తల్లి మంజుల ఆ స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సౌడయ్యన్‌, స్వాతి తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు వెస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-02-17T16:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising