ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oxygen: ప్రాణవాయువు అందక ఊపిరి ఆగింది

ABN, First Publish Date - 2022-10-21T15:30:11+05:30

చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌(Oxygen) కొరత కారణంగా ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. దీంతో ఈ సంఘటనపై వైద్యశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రిలో ఘటన

- అధికారుల విచారణ


చెన్నై, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌(Oxygen) కొరత కారణంగా ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. దీంతో ఈ సంఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. కాంచీపురం సమీపం నజరత్‌పేటకు చెందిన కళానిధి(64) అనే వృద్ధురాలు గత వారం శ్వాసకోస సమస్యతో ఆ ఆసుపత్రిలో చేరారు. కళానిధి మనవడు కార్తీక్‌ ఆమెను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్ళాడు.. ఆ సందర్భంగా కళానిధికి తక్కువ మోతాదులో ఆక్సిజన్‌ సరఫరా అవుతుండటం గమనించి నర్సుకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆసుపత్రి ఉన్నతాధికారులకు చెప్పేందుకు వెళ్లేలోగా కళానిధి ప్రాణాలు కోల్పోయారు. ఇదే విధంగా పూచ్చివాక్కంకు చెందిన రాధాకృష్ణన్‌ (70) అనే వృద్ధుడు కూడా ఆక్సిజన్‌ కొరత కారణంగా మృతి చెందాడని చెబుతున్నారు. ఈ రెండు సంఘటనలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-10-21T15:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising