వృద్ధ దంపతుల దారుణ హత్య
ABN, First Publish Date - 2022-02-10T17:10:58+05:30
నగర శివారులోని బిడదిలో వృద్ధ దంపతులను హతమార్చిన సం ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈగల్టన్ రిసార్టులోని ఒక విల్లాలో ఎయిర్ఫోర్స్ రిటైర్డు వింగ్ కమాండర్, తమిళనాడుకు చెందిన రఘు
బెంగళూరు: నగర శివారులోని బిడదిలో వృద్ధ దంపతులను హతమార్చిన సం ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈగల్టన్ రిసార్టులోని ఒక విల్లాలో ఎయిర్ఫోర్స్ రిటైర్డు వింగ్ కమాండర్, తమిళనాడుకు చెందిన రఘురాజ్ (70), భార్య ఆశా(65) ఉంటున్నారు. ఇనుపసుత్తితో కొట్టి వీరిని హతమార్చారు. ఇంటి పనిచేసే బిహార్కు చెందిన జో గిందర్సింగ్ తన సహచరులతో కలసి కుట్ర పన్ని ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. రఘురాజ్ కుమారుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు. అయినా ఫోన్ తీయకపోవడంతో అనుమానంతో రిసార్టు సిబ్బందికి విషయం తెలిపాడు. రిసార్టు భద్రతా సిబ్బంది విల్లాకు చేరుకోగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పరుగెత్తడాన్ని గుర్తించారు. ఇంట్లో ఉన్న జోగిందర్ను ప్రశ్నించగా రఘురాజ్ దంపతులు నిద్రపోతున్నారన్నారు. అయినా అతడి తీరుపై పరిశీలించగా ఇంటి వెనుక గేటునుంచిపారిపోయాడు. వృద్ధ దంపతులు హత్యకు గురైనట్టు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రామనగర జిల్లా ఎస్పీ సంతోష్ బాబు మార్గదర్శకంలో ప్రత్యేకబృందం ఏర్పాటైంది. ఆరుగంటలలోనే ఒక నిందితుడిని అరెస్టు చేశారు. బిహార్కు చెందిన జోగిందర్ కుమార్ యాదవ్ (21)ను అరెస్టు చేశారు. మరొక నిందితుడి కోసం గాలింపులు చేపట్టామని డీఎస్పీ మో హన్కుమార్ తెలిపారు.
Updated Date - 2022-02-10T17:10:58+05:30 IST