ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి గొడవల్లో తల్లిని చంపిన తనయుడు.. ఆపై రైలు కింద దూకి..

ABN, First Publish Date - 2022-07-10T17:43:12+05:30

ఆస్తి గొడవల కారణంగా తల్లిని గొంతు కోసి హత్య చేసిన కుమారుడు ఆపై రైలు కింద దూకి ఆత్మహత్యకు యత్నించాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఆస్తి గొడవల కారణంగా తల్లిని గొంతు కోసి హత్య చేసిన కుమారుడు ఆపై రైలు కింద దూకి ఆత్మహత్యకు యత్నించాడు. సబర్బన్ ముంబై (Mumbai)లోని ములుంద్‌లో జరిగిందీ ఘటన. వర్ధమాన్ నగర్‌లోని హౌసింగ్ సొసైటీలో నివసించే 21 ఏళ్ల జయేష్ పంచల్ ఆస్తి విషయంలో తల్లితో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో కోపం పట్టలేక పదునైన ఆయుధంతో గొంతు కోసి హతమార్చాడు. ఆపై ములుంద్ రైల్వే స్టేషన్‌లో లోకల్ రైలు కింద దూకి ఆత్మహత్య (Suicide)కు యత్నించాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు అతడిని రక్షించారు. 


జయేష్ ఫ్లాట్ బయట రక్తపు మరకలు ఉండడంతో అనుమానించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్‌లో తలపులు తెరిచి లోపలికి ప్రవేశించారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను చాయా పంచల్‌ (42)గా గుర్తించారు. ఘటనా స్థలంలో గుజరాతీలో రాసి ఉన్న నోట్‌తోపాటు ఓ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి విషయంలో ఒత్తిడితో తానే ఈ హత్య చేసినట్టు జయేష్ అందులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-10T17:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising