ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: భర్త నిద్రలేపితే ట్రైన్ వచ్చిందనుకుంది.. కానీ, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయింది!

ABN, First Publish Date - 2022-08-23T23:00:14+05:30

ప్లాట్‌ఫామ్‌పై నిద్రపోతున్న ఆమె భర్త తట్టిలేపితే ట్రైన్ వచ్చిందనుకుని వెంటనే నిద్రలేచింది. ఆపై కళ్లు తెరిచి మూసేంతలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్లాట్‌ఫామ్‌పై నిద్రపోతున్న ఆమె భర్త తట్టిలేపితే ట్రైన్ వచ్చిందనుకుని వెంటనే నిద్రలేచింది. ఆపై కళ్లు తెరిచి మూసేంతలోనే ఊహించని ఘోరం జరిగిపోయింది. నిద్రలేచిన భార్య రెక్కలను బలంగా పట్టుకుని ప్లాట్‌ఫామ్ ఒడ్డుకు ఈడ్చుకెళ్లిన భర్త.. వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కిందికి తోసేశాడు. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయి రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిందీ ఘటన. 


30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నమోదైన దృశ్యాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రపోతున్న తన భార్యను నిందితుడు నిద్రలేపాడు. కళ్లు నులుముకుని నిద్రలేచిన ఆమె పెడరెక్కలు గట్టిగా పట్టుకుని ఫ్లాట్‌ఫామ్ ఒడ్డుకు తీసుకెళ్లాడు. ఆపై వేగంగా దూసుకొస్తున్న ట్రైన్ కిందకు ఒక్క పెట్టున తోసేశాడు. రైలు చక్రాల కింద నలిగిపోయిన బాధితురాలు మరణించింది. భార్యను చక్రాల కిందికి తోసేసిన నిందితుడు అనంతరం తన ఇద్దరు పిల్లలు, లగేజీ తీసుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.  


అక్కడి నుంచి పరారైన నిందితుడు దాదర్ ట్రైన్ ఎక్కాడు. అక్కడి నుంచి కల్యాణ్ చేరుకున్నాడు. నిందితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.  సోమవారం రాత్రి థానే జిల్లాలోని భివాండిలో అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తన భర్త స్నేహితుడితో కలిసి రెండు రోజుల క్రితం వెళ్లిపోయినట్టు తేలింది. ఇది భర్తలో అనుమానాన్ని రేకెత్తించింది. అదే ఈ ఘటనకు కారణమైనట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆ జంట ఆదివారం ఉదయం నుంచి వాసాయి రైల్వే స్టేషన్‌లోనే ఉందని, పలుమార్లు గొడవపడ్డారని వాసాయి గవర్నమెంట్ రైల్వే పోలీసులు (VGRP) తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు.   



Updated Date - 2022-08-23T23:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising