ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Wrenching: ఇలా చేశావేంటి తల్లీ.. ఆ పిల్లాడి ముఖం చూసి ఒక్క క్షణం ఆలోచించి ఉంటే..

ABN, First Publish Date - 2022-06-16T02:50:43+05:30

నిఖిత అనే యువతికి, దావణగెరె మెట్రోపాలిటన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మనోజ్ కుమార్‌తో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగళూరు: భర్త ధన దాహానికి భార్యాబిడ్డ బలయిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లా జగళూరులో వెలుగుచూసింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ పెడుతున్న చిత్రహింసలు భరించలేక 10 నెలల బాబును చంపి ఆ వివాహిత కూడా ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిత అనే యువతికి, దావణగెరె మెట్రోపాలిటన్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మనోజ్ కుమార్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని నెలలు భార్యతో అన్యోన్యంగానే ఉన్న మనోజ్ ప్రవర్తనలో రానురానూ మార్పొచ్చింది.



భార్యకు తెలియకుండా కొందరు యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో నిలదీసినందుకు ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. మనోజ్‌తో పాటు అతని తండ్రి, తల్లి అదనపు కట్నం కోసం నిఖితను వేధించసాగారు. బాబు పుట్టాడు. పిల్లాడు పుట్టాక కూడా మనోజ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. చుట్టుపక్కల వారి దృష్టిలో మంచి కుటుంబం అనిపించుకోవడం కోసం బాబుకు సంబంధించి ఫంక్షన్లు గట్రా కూడా చేశారు. ఇటీవల భర్త, అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో తాను ఇక ఆ ఇంట్లో ఉండలేనంటూ నిఖిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. నిఖిత తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.



కూతురి పరిస్థితి అర్థం చేసుకుని ఇంటికొచ్చేయమని చెప్పడంతో భర్తతో మనస్పర్థల కారణంగా పిల్లాడిని తీసుకుని నిఖిత పుట్టింటికి వెళ్లిపోయింది. మంగళవారం ఉదయం నిఖిత తల్లిదండ్రులిద్దరూ టీచర్స్ కావడంతో ఉద్యోగ నిమిత్తం స్కూల్‌కు వెళ్లారు. తిరిగొచ్చేసరికి ఇంట్లో 10 నెలల మనవడు, కూతురు నిఖిత విగత జీవులుగా పడి ఉన్నారు. పిల్లాడిని ఉరేసి చంపి ఆ తర్వాత నిఖిత కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. భర్త, అత్తమామల వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని నిఖిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి సమయంలో ఆరు లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చామని, బంగారం కూడా ఇచ్చామని అయినా అతని ధన దాహం తీరలేదని కూతురు, మనవడి మృతదేహాలను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. జగళూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-06-16T02:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising