ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్‌.. దాడి

ABN, First Publish Date - 2022-08-27T13:06:15+05:30

ఈరోడ్‌ జిల్లా పుంజై పులియంపట్టిలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వరన్‌(Former MLA Eswaran)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                  - పార్టీ మాజీ నేతపై అనుమానం?


అడయార్‌(చెన్నై), ఆగస్టు 26: ఈరోడ్‌ జిల్లా పుంజై పులియంపట్టిలో అన్నాడీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఈశ్వరన్‌(Former MLA Eswaran)ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో పార్టీకి చెందిన మాజీ నేత హస్తం వుండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 45 ఏళ్ళ ఈశ్వరన్‌  2016 నుంచి 2021 వరకు అన్నాడీఎంకే(AIADMK) తరపున భవానీసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భుజంగనూరులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఈ నెల24న ఈశ్వరన్‌ను కొందరు కిడ్నాప్‌ చేశారు. ఆయనపై దాడి చేయడంతో గాయపడ్డారు. ఈశ్వరన్‌కు సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరు(Coimbatore) జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ కిడ్నాప్‌, దాడి ఘటనకు సంబంధించి పుంజై పులియంపట్టికి చెందిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కిడ్నాప్‌ ఘటనపై ఈశ్వరన్‌(Eswaran) మాట్లాడుతూ... ఈ నెల 24వ తేదీన ద్విచక్రవాహనంపై పులియంపట్టి నుంచి భవానీసాగర్‌కు వెళుతుండగా, ఆరుగురు వ్యక్తుల ముఠా తనను అడ్డగించి బలవంతంగా కారులో కిడ్నాప్‌ చేసిందని, అరగంట పాటు కారులోనే తిప్పిన ఆ ముఠా తనపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిందని వెల్లడించారు. చివరకు రూ.1.50 కోట్ల నగదు డిమాండ్‌ చేశారని, ఈ కిడ్నాప్‌ వెనుక పార్టీ మాజీ నేత మిలిటరీ శరవణన్‌ హస్తం ఉందని, అందుకే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2022-08-27T13:06:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising