ఏనుగు దాడిలో ఇద్దరి మృతి
ABN, First Publish Date - 2022-04-12T17:16:43+05:30
హాసన్ జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృత్యువాత చెందారు. బేలూరు తాలూకా కడెగర్జె గ్రామానికి చెందిన కాఫీ తోట కార్మికులు చిక్కయ్య (65), ఈరయ్య (68) సోమవారం
- ఆందోళనలో కాఫీ తోటల కార్మికులు
బెంగళూరు: హాసన్ జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృత్యువాత చెందారు. బేలూరు తాలూకా కడెగర్జె గ్రామానికి చెందిన కాఫీ తోట కార్మికులు చిక్కయ్య (65), ఈరయ్య (68) సోమవారం ఏనుగులో దాడిలో బలయ్యారు. చన్నరాయపట్టణ పరిధిలోని గులసింద గ్రామ చెరువులో జలకాలాడిన ఒక ఏనుగు సంచరిస్తూ బేలూరు తాలూకా ప్రాంతానికి చేరుకుంది. పనుల కోసం వెళ్లిన ఇద్దరు కార్మికులు ఏనుగు దాడిలో మృతిచెందారు. దీంతో గ్రామంలో ఇతర తోట కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అరెహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మృతితో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది. కాగా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఆలూఆరు, సకలేశపుర తాలూకాలకే పరిమితమైన ఏనుగుల దాడులు బేలూరు తాలూకాకు కూడా చేరాయి. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-04-12T17:16:43+05:30 IST