ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏనుగు దాడిలో రైతు మృతి

ABN, First Publish Date - 2022-04-10T13:33:43+05:30

ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శనివారం తెల్లవారు జామున జరిగిన ఏనుగు దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిమ్మప్పనాయుడు (65) అనే రైతు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం(చిత్తూరు): ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో శనివారం తెల్లవారు జామున జరిగిన ఏనుగు దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిమ్మప్పనాయుడు (65) అనే రైతు దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రం వేపనపల్లె యూని యన్‌ పరిధిలోని కొంగనపల్లెకు చెందిన రైతు తిమ్మప్పనాయుడికి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన శనివారం తెల్లవారు ఝామున 5 గంటల సమయంలో పొలం వద్దకు బయలు దేరాడు. మార్గమధ్యంలో చెట్లమధ్య పొంచి ఉన్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఆయనపైకి వచ్చింది. తొండంతో అమాంతం పైకెత్తి, కాలికింద వేసి తొక్కింది. దీంతో తల నుజ్జునుజ్జైన తిమ్మప్పనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు. ఏనుగు దాడిలో తిమ్మప్పనాయుడు మృతి చెందడంతో బంధు వులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఏనుగుల దాడులతో గ్రామీణులు భయాందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో జరుగుతున్న ఏనుగుల దాడులవల్ల పంటలు నష్టపోవడమేకాక, ప్రాణాలకు కూడా ముప్పు వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు దాహం తీర్చుకోవడానికి, ఆహారంకోసం తరచూ సరిహద్దు గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. భీతావహ పరిస్థితులు నెలకొంటున్నాయి. అటవీశాఖాధికారులు ఏనుగుల దాడుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని మూడు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-10T13:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising