IPL bettingలో కోట్లు లాస్.. ఓ వ్యాపారవేత్త చేసిన దారుణం
ABN, First Publish Date - 2022-07-17T23:01:09+05:30
రెండు రోజుల క్రితం భార్య, ఇద్దరు కూతుళ్లను హతమార్చి తాను హత్య చేసుకున్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త మరణానికి గత కారణాన్ని పోలీసులు చేధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్(IPL betting)లో కోట్లు కోల్పోయిన అతడు...
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం భార్య, ఇద్దరు కూతుళ్లను హతమార్చి తాను హత్య చేసుకున్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త మరణానికి గత కారణాన్ని పోలీసులు చేధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్(IPL betting)లో కోట్లు కోల్పోయిన అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్కు చెందిన ఇస్రార్ అహ్మద్(40) అనే వ్యక్తి శుక్రవారం ఉదయం భార్య ఫరీనా పర్వీన్(35) సహా యస్వికా(11), ఇనాయా(9) అనే ఇద్దరు కూతుళ్లను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వ్యాపారంలో నష్టం రావడం వల్ల ఇస్రార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు మొదట తెలిపారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం.. ఐపీఎల్ బెట్టింగ్లో వచ్చిన నష్టమే కారణమని పేర్కొన్నారు. తన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని ఆస్తులు సైతం అమ్మాడట. ఈ విషయమై ఢిల్లీ ఈశాన్య డిప్యూటీ కమిషనర్ సంజయ్ సెయిన్ మాట్లాడుతూ ‘‘మూడు నెలల క్రితమే ఇస్రాన్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఐపీల్లో బెట్టింగ్లు పెట్టి కోట్ల రూపాయలు నష్టపోయాడు. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొన్ని ఆస్తుల్ని సైతం అమ్ముకున్నాడు’’ అని తెలిపారు.
Updated Date - 2022-07-17T23:01:09+05:30 IST