ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajasthanలో పాఠశాల బాలికపై అత్యాచారం

ABN, First Publish Date - 2022-01-27T13:33:17+05:30

ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బిచివారా గ్రామానికి చెందిన ఓ బాలిక తన సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. భోజన విరామ సమయంలో బాలిక బయటకు రాగా, 12వతరగతి చదివే ఓ విద్యార్థి బాలికను బలవంతంగా మోటారుసైకిలుపై ఎక్కించుకొని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై గంటల తరబడి అత్యాచారం చేశాడు. అనంతరం అమ్మాయిని ఆమె ఇంటి వద్ద వదిలేశాడు.అత్యాచారానికి గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 



బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేర పోలీసులు నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అదే పాఠశాలలో చదువుతున్న అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రాకేష్ కుమార్ శర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T13:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising