Charger: సెల్ఫోన్ ఛార్జర్ పేలి ఒకరి మృతి
ABN, First Publish Date - 2022-08-21T15:46:22+05:30
గోపిశెట్టిపాళయంలో సెల్ఫోన్ ఛార్జర్(Cell phone charger) పేలి యువకుడు మృతిచెందాడు. మూపనూర్కు చెందిన అర్జునన్ (34)కు భార్య, ఇద్దరు
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 20: గోపిశెట్టిపాళయంలో సెల్ఫోన్ ఛార్జర్(Cell phone charger) పేలి యువకుడు మృతిచెందాడు. మూపనూర్కు చెందిన అర్జునన్ (34)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం రాత్రి భార్యాపిల్లలు ఇంట్లో నిద్రించగా, సమీపంలో ఆకులతో వేసిన ఇంట్లో అర్జునన్ నిద్రించాడు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సెల్ఫోన్ ఛార్జర్ ఒక్కసారిగా పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. గుడిసె కావడంతో మంటల్లో చిక్కుకుని అతడు సజీవదహనమయ్యాడు. సిరువలూర్ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపుచేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-08-21T15:46:22+05:30 IST