ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minor Girl: మైనర్ బాలికను అపహరించి సామూహిక అత్యాచారం.. గొంతు కోసి చంపేందుకు ప్రయత్నం.. చివరకు..

ABN, First Publish Date - 2022-09-21T23:04:47+05:30

ఆ బాలిక వయసు 14 ఏళ్లు.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ బాలిక గత గురువారం తెల్లవారుఝామున

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ బాలిక వయసు 14 ఏళ్లు.. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆ బాలిక గత గురువారం తెల్లవారుఝామున 4 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ఆ సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికను కిడ్నాప్ చేశారు.. ఇద్దరూ ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. అనంతరం సాక్ష్యం దొరక్కుండా ఉండేందుకు ఆ బాలిక గొంతు కోసేశారు.. ఆ బాలిక చనిపోయిందని నిర్ధారించుకుని వెళ్లిపోయారు.. రక్తపు మడుగులో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలికను తెల్లవారిన తర్వాత గ్రామస్థులు చూశారు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆ బాలిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. 


ఇది కూడా చదవండి..

ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 16 ఏళ్ల బాలిక.. దగ్గరకు తీసి ఏమైందని పోలీసులు అడిగితే ఆమె చెప్పింది విని..


బీహార్‌ (Bihar)లోని బెట్టియాకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నిందితులు గొంతు కోసెయ్యడం వల్ల ఆ బాలిక మాట్లాడలేకపోతోంది. తనపై జరిగిన దురాగతం గురించి సైగలు, హావభావాల ద్వారా కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెబుతోంది. బాధిత బాలిక గత గురువారం తెల్లవారుజామున 4 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెను పట్టుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాక్ష్యం లేకుండా చేసేందుకు ఇద్దరూ కలిసి ఆ బాలిక గొంతు కోశారు. ఆమె చనిపోయిందని భావించి పారిపోయారు.


రోడ్డు పక్కన నగ్నంగా అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను గ్రామస్థులు చూశారు. బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఆ బాలికను వెంటనే హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారం అందించారు.  ప్రస్తుతం ఆ బాలిక మాట్లాడే పరిస్థితిలో లేదు. తన చేతితో సైగలు చేస్తూ తనపై జరిగిన దురాగతం గురించి వివరిస్తోంది. ఆ బాలిక చెబుతున్న దాని ప్రకారం ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు సాగిస్తున్నారు. 

Updated Date - 2022-09-21T23:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising