Arrest: నకిలీ మార్కుల జాబితా ముఠా అరెస్టు
ABN, First Publish Date - 2022-12-07T11:45:10+05:30
పరీక్షలు రాయకుండానే ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పీయూ కళాశాలల మార్క్కార్డులను ఇప్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయల వంచనకు
బెంగళూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పరీక్షలు రాయకుండానే ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పీయూ కళాశాలల మార్క్కార్డులను ఇప్పిస్తామని నమ్మించి లక్షలాది రూపాయల వంచనకు పాల్పడుతున్న ముఠాను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను నగర పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డి(City Police Commissioner Prathapara Reddy) మంగళవారం మీడియాకు వివరించారు. వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్లో నిందితుల నుంచి 1097 నకిలీ రికార్డులు, పీహెచ్డీ పుస్తకాలు, హార్డ్డిస్క్, ప్రింటర్, మొబైల్ ఫోన్లు, రబ్బర్స్టాంపులను స్వాదీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒక్కో అభ్యర్థి నుంచి లక్ష రూపాయల కంటే ఎక్కువగా వసూలు చేసినట్టు తెలుస్తోందన్నారు. మహాలక్ష్మి లే అవుట్, మారతహళ్లి, కొడిగేహళ్లిలోని ఇన్స్టిట్యూట్ శాఖలపై దాడులు నిర్వహించామన్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలలోని యూనివర్సిటీలకు చెందిన ఖాళీ మార్కుల జాబితాలు వీరి వద్ద ఉన్నట్టు గుర్తించామన్నారు.
Updated Date - 2022-12-07T11:45:13+05:30 IST