ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బాదంపప్పు దొంగిలించాడట.. 11 ఏళ్ల బాలుడిని చెట్టుకు కట్టేసి చావబాదిన పూజారి!

ABN, First Publish Date - 2022-09-11T02:34:16+05:30

గుప్పెడు బాదం గింజలు ఎంతుంటాయి? మహా అయితే రూ. 100లోపే ఉంటాయి. మరి రెండుమూడు గింజలైతే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్: గుప్పెడు బాదం గింజలు ఎంతుంటాయి? మహా అయితే రూ. 100లోపే ఉంటాయి. మరి రెండుమూడు గింజలైతే ఓ రూ. 10-20 ఉంటాయి కావొచ్చు. వాటిని దొంగిలించాడని ఓ బాలుడిని పట్టుకున్న ఆలయ పూజారి చెట్టుకు కట్టేసి చావబాదాడు. దేవుడికి నిత్య కైంకర్యాలు చేసే ఆ పూజారిలోని క్రూరత్వం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిందీ ఘటన. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కరీలాలోని జైన్ సిద్దయటన్ మందిర పూజారి రాకేశ్ జైన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.  


చెట్టుకు కట్టేసి ఉన్న బాలుడు తనను విడిపించమని ఏడుస్తూ బతిమాలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆలయ గేటు వద్ద నిలబడి ఉన్న బాలుడు బాదం గింజలు దొంగిలించాడన్నది అతడిపై ఉన్న ప్రధాన ఆరోపణ. బాలుడు దొంగతనం చేశాడని భావించిన పూజారి, మరో యువకుడితో కలిసి బాధిత బాలుడిని పట్టుకుని చెట్టుకు కొట్టేసి ఆపై విచక్షణ రహితంగా కొట్టారనేది బాలుడి ఆరోపణ. పూజారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.



Updated Date - 2022-09-11T02:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising