నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ABN, First Publish Date - 2022-08-18T15:38:56+05:30
స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు.. నిఫ్టీ(Nifty) 35 పాయింట్లకు పైగా నష్టపోయింది
Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(Sensex) 120 పాయింట్లు.. నిఫ్టీ(Nifty) 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. హెచ్డీఎఫ్సీ(HDFC), పవర్ గ్రిడ్(Power Grid), హీరో(Hero), ఐటీసీ(ITC) కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్(Dr. Reddys), సన్ ఫార్మా(Sun Pharma), ఓఎన్జీసీ(ONGC), విప్రో(Wipro), సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. భారత్లో పెట్రోలియం(Petrolium) ఉత్పత్తుల గిరాకీ పెరగనుంది. గత ఏడాదితో పోలిస్తే ఒపెక్(OPEC) 7.73 శాతం పెరగనుంది. పెట్రో ఉత్పత్తుల గిరాకీ వృద్ధి ప్రపంచంలోనే అధికంగా ఉంది. అమెరికా కంపెనీ ఎగ్జాన్మొబిల్తో ఓఎన్జీసీ(ONGC) ఒప్పందం చేసుకుంది. దేశం సముద్ర జలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణను ముమ్మరం చేశారు. ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రూ.600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు గ్రాన్యూల్స్ ఇండియా(Granules India) ప్రకటించింది. డైసియాండియామైడ్ తయారీ కోసం గ్రాన్యూల్స్ ఇండియాకు అనుమతి లభించింది.
Updated Date - 2022-08-18T15:38:56+05:30 IST