నవంబరు 3న ఆర్బీఐ ఎంపీసీ ప్రత్యేక భేటీ
ABN, First Publish Date - 2022-10-28T02:59:04+05:30
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వచ్చే నెల (నవంబరు) 3న ప్రత్యేకంగా సమావేశమవుతోంది...
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) వచ్చే నెల (నవంబరు) 3న ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ద్రవ్యోల్బణంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆరు శాతం మించకుండా కట్టడి చేయలేకపోవడానికి గల కారణాలపైనా చర్చించి, ప్రభుత్వానికి నివేదించనుంది. పనిలోపనిగా ఈ ప్రత్యేక భేటీలో రెపో రేటు మరింత పెంచే అంశంపైనా ఎంపీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Updated Date - 2022-10-28T02:59:07+05:30 IST