సెలెక్ట్ మొబైల్స్ సంక్రాంతి ఆఫర్లు
ABN, First Publish Date - 2022-01-13T07:48:10+05:30
సెలెక్ట్ మొబైల్స్ ఈ సంక్రాంతికి భారీ ఆఫ ర్లు ప్రకటించింది. రూ.7వేల స్మార్ట్వాచ్తోపాటు నెక్ బ్యాండ్ ను కేవలం రూ.1,999కే అందిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్: సెలెక్ట్ మొబైల్స్ ఈ సంక్రాంతికి భారీ ఆఫ ర్లు ప్రకటించింది. రూ.7వేల స్మార్ట్వాచ్తోపాటు నెక్ బ్యాండ్ ను కేవలం రూ.1,999కే అందిస్తున్నట్లు తెలిపింది. రూ.5,199 విలువైన బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్వాచ్ను సైతం రూ.1,999 కే ఆఫర్ చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి రేతినేని వెల్లడించారు. అంతే కాదు ప్రతి టీవీ, ట్యాబ్ కొనుగోలుపై రూ.5,000 వరకు క్యాష్బ్యాక్, 32జీబీ స్మార్ట్ఫోన్పై రూ.1,500 విలువైన టీడబ్ల్యూఎస్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఎంపిక చేసిన మోడళ్లపై 75 శాతం వరకు తగ్గింపుతోపాటు జెస్ట్ మనీ ద్వారా ఒక ఈఎంఐ ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు.
షామీ 11ఐ 5జీ ఫోన్ లాంచ్
షామీకి చెందిన 11ఐ 5జీ ఫోన్ను అందరికంటే ముందు తమ స్టోర్లలో అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ తెలిపింది. సెలెక్ట్ మొబైల్స్ మాదాపూర్ స్టోర్లో సినీతార అనన్య నాగళ్ల ఈఫోన్ను విడుదల చేశారు.
Updated Date - 2022-01-13T07:48:10+05:30 IST