స్కార్పియో సరికొత్తగా.. ప్రారంభ ధర రూ.11.99 లక్షలు
ABN, First Publish Date - 2022-06-28T06:50:30+05:30
దేశీయ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ఎస్యూవీ మోడల్ స్కార్పియోను సరికొత్త రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది.
ముంబై: దేశీయ వాహన తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ఎస్యూవీ మోడల్ స్కార్పియోను సరికొత్త రూపంలో మార్కెట్లోకి విడుదల చేసింది. ఐదు వేరియంట్లలో (జెడ్ 2, జెడ్ 4, జెడ్ 6, జెడ్ 8, జెడ్ 8ఎల్) లభించనున్న స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు. కాగా, టాప్ వేరియంట్ రేటు రూ.19.49 లక్షలుగా ఉంది. పెట్రోల్తో పాటు డీజిల్ ఇంజన్ ఆప్షన్తో లభించనున్న ఈ కారును అత్యాధునిక ఫీచర్లు, సాంకేతికతతో డిజైన్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. మహీంద్రా డీలర్ కేంద్రాలతో పాటు ఆన్లైన్ ద్వారా స్కార్పియో ఎన్ బుకింగ్ వచ్చే నెల 30 నుంచి ప్రారంభం కానుందని, పండగ సీజన్లో వాహనాలను కస్టమర్లకు అందించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. టాటా సఫారీ, హ్యుండయ్ క్రెటా, టయోటా ఫార్చునర్కు పోటీగా మహీంద్రా ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
Updated Date - 2022-06-28T06:50:30+05:30 IST