ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఎ్‌సఆర్‌ నాయుడుకు పీఆర్‌ఎ్‌సఐ అవార్డు

ABN, First Publish Date - 2022-12-30T03:22:12+05:30

పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగంలో ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న వీఎ్‌సఆర్‌ నాయుడుకు ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) అవార్డు లభించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగంలో ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న వీఎ్‌సఆర్‌ నాయుడుకు ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎ్‌సఐ) అవార్డు లభించింది. పీఆర్‌ఎ్‌సఐలో నాయుడు సీనియర్‌ సభ్యులు. పబ్లిక్‌ రిలేషన్స్‌ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ.. భోపాల్‌లో జరిగిన ఆల్‌ ఇండియా పబ్లిక్‌ రిలేషన్స్‌ కాన్ఫరెన్స్‌ (ఏఐపీఆర్‌సీ)లో ఈ అవార్డును అందజేశారు. వీఎ్‌సఆర్‌ నాయుడు ఏపీఎ్‌సఈబీ/ఏపీ ట్రాన్స్‌కోలో 33 ఏళ్లపాటు పని చేశారు. చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌) హోదాలో పదవీ విరమణ చేశారు. పీఆర్‌ఎ్‌సఐ-అమరావతి చాప్టర్‌ వ్యవస్థాపక చైర్మన్‌గా 2018-2022 మధ్య కాలంలో సేవలు అందించారు. ప్రస్తుతం అమరావతి చాప్టర్‌కు సలహాదారుగా ఉన్నారు. గతంలో (1994-95) పీఆర్‌ఎ్‌సఐ-ఏపీ చైర్మన్‌గా పనిచేశారు. ‘అవుట్‌ స్టాండింగ్‌ కంట్రిబ్యూషన్‌’ అవార్డును మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ మంగు భాయ్‌ పటేల్‌ నుంచి అందుకున్నారు.

Updated Date - 2022-12-30T03:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising