ప్రముఖ బ్యాంకర్ అన్షు జైన్ మృతి
ABN, First Publish Date - 2022-08-14T09:03:40+05:30
భారత సంతతికి చెందిన ప్రముఖ బ్యాంకర్, డాయిష్ బ్యాంక్ మాజీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్షు జైన్ మరణించారు.
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ప్రముఖ బ్యాంకర్, డాయిష్ బ్యాంక్ మాజీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్షు జైన్ మరణించారు. ఐదేళ్లుగా కేన్సర్తో పోరాడుతున్న జైన్.. శనివారం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డాయిష్ బ్యాంక్ ఏజీకి అన్షు జైన్ 2012 నుంచి 2015 వరకు కో-సీఈఓగా పనిచేశారు.
Updated Date - 2022-08-14T09:03:40+05:30 IST