ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MTR Foods: ఏపీ, తెలంగాణలో విస్తృత శ్రేణి పొడులను విడుదల చేసిన ఎంటీఆర్‌ ఫుడ్స్‌

ABN, First Publish Date - 2022-09-14T03:29:08+05:30

ఏపీ, తెలంగాణలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని ప్రతి ఇంట్లోనూ రుచులకు ఘుమఘుమలు జోడిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని ప్రతి ఇంట్లోనూ రుచులకు ఘుమఘుమలు జోడిస్తున్న ఎంటీఆర్ ఫుడ్స్ (MTR Foods) ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో మరిన్ని పొడులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాదనం, పదార్థాల లభ్యత కారణంగా చాలామంది గృహిణులు అప్పటికప్పుడు పొడులు తయారుచేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తాజాదనం, రుచుల కలబోతతో కంది, ఇడ్లీకారం, కరివేపాకు పొడిని విడుదల చేసింది.


నిజానికి ఈ పొడులు తెలుగు వారికి చాలా ఇష్టమైనవి. వారిని దృష్టిలో పెట్టుకుని అత్యంత రుచికరమైన, ఇంట్లో తయారుచేసుకున్నంత రుచిగా వీటిని తీసుకొచ్చింది. నాణ్యమైన ముడి పదార్ధాలు మాత్రమే వినియోగించడం వల్ల సుదీర్ఘకాలం పాటు నిల్వ ఉండగలవనే భరోసాను ఎంటీఆర్ ఫుడ్స్ అందిస్తోంది. 20 గ్రాముల ప్యాక్‌ను 10 రూపాయలకు, 100 గ్రాముల ప్యాక్‌ను 45 రూపాయలకు అందిస్తోంది.

Updated Date - 2022-09-14T03:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising