ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 100 నోటుకే గిరాకీ.. రూ. 2 వేల నోటును పట్టించుకోని జనం

ABN, First Publish Date - 2022-05-28T22:19:49+05:30

నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఆ తర్వాత నెమ్మదిగా మునుపటి పరిస్థితులు రావడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. ఆ తర్వాత నెమ్మదిగా మునుపటి పరిస్థితులు రావడంతో ప్రస్తుతం నగదు లావాదేవీలు కూడా మామూలుగానే జరుగుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత అప్పటి వరకు ఉన్న వెయ్యి రూపాయల నోటు స్థానంలో కొత్తగా రూ. 2 వేల నోటు చలామణిలోకి వచ్చింది. ప్రస్తుతం నగదు లావాదేవీలు విరివిగానే జరుగుతున్నప్పటికీ రూ. 2 వేల నోటు గురించి జనం పెద్దగా పట్టించుకోవడం లేదంటూ భారతీయ రిజర్వు బ్యాంకు ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. నగదు లావాదేవీల సమయంలో జనం ఎక్కువగా రూ. 100 నోటకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొంది. రూ. 2 వేల నోటును ప్రజలు అసలు పట్టించుకోవడం లేదని, రూ. 500 నోటు మాత్రం చలామణిలో ఎక్కువగా వినియోగిస్తున్నట్టు వివరించింది.


28 రాష్ట్రాలు, మూడు కేంద్రత పాలిత ప్రాంతాల్లోని గ్రామాలు, పాక్షిక పట్టణాలు, పట్టణాలు, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే అనంతరం ఆర్బీఐ ఈ నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 3 శాతం మంది ప్రజలు బ్యాంకు నోట్లపై ఉండే మహాత్మాగాంధీ వాటర్ మార్క్ బొమ్మ, సెక్యూరిటీ థ్రెడ్‌ వంటి భద్రతా ఫీచర్లను గుర్తించలేకపోయారు. ఇక, నాణేల విషయానికి వస్తే 5 రూపాయల నాణేనికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుండగా, రూపాయి నాణేనికి చివరి ప్రాధాన్యం లభిస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక పేర్కొంది.

Updated Date - 2022-05-28T22:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising