ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల అమ్మకాలు జయహో

ABN, First Publish Date - 2022-06-30T09:18:00+05:30

ఇళ్ల అమ్మకాలు జయహో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యు1లో 4.5 రెట్లు పెరుగుదల 

ప్రాప్‌టైగర్‌


న్యూఢిల్లీ : హైదరాబాద్‌, ముంబై, చెన్నైతో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ నగరాల్లో 74,330 ఇళ్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడైన 15,968తో పోలిస్తే ఇది నాలుగున్నర రెట్లు ఎక్కువ. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోల్చినా నివాస గృహాల అమ్మకాలు ఐదు శాతం పెరిగాయి. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్‌ ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. గత మూడు నెలల్లో ఆర్‌బీఐ రెండు సార్లు కీలక రెపో రేట్లు పెంచింది. దాంతో గృహ రుణాల వడ్డీ రేట్లూ పెరిగాయి. అయినా వడ్డీరేట్లు ఇంకా అందుబాటులోనే ఉన్నట్టు ప్రాప్‌టైగర్‌ తెలిపింది. గత ఏడాదితో  పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో, ఈ నగరాల్లో ఇళ్ల ధరలు ఐదు నుంచి తొమ్మిది శాతం పెరిగాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వెంటనే గృహ ప్రవేశం చేసే ఇళ్లకు కొనుగోలుదారులు అధిక ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. 


హైదరాబాద్‌కు చోటు

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిర వాణిజ్య రియల్టీలో హైదరాబాద్‌కు చోటు దక్కింది. మొత్తం 20 నగరాలతో నైట్‌ఫ్రాంక్‌ సంస్థ రూపొందించిన ఈ  జాబితాలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలకూ చోటు దక్కింది. పట్టణీకరణ ఒత్తిళ్లు, ఉద్గారాలు, వాతావరణ ముప్పు, ప్రభుత్వ చర్యల ఆధారంగా నైట్‌ఫ్రాంక్‌ సంస్థ ఈ నగరాలను ఎంపిక చేసింది. టాప్‌-20లో బెంగళూరుకు 14, ఢిల్లీకి 17, హైదరాబాద్‌కు 18, ముంబైకి 20వ స్థానం లభించాయి.

Updated Date - 2022-06-30T09:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising