Bumper Offer..భారీగా తగ్గిన బంగారం ధర, అదే బాటలో వెండి..
ABN, First Publish Date - 2022-09-02T14:42:40+05:30
బంగారం కొనుగోలు చేసే వారికి బంఫర్ ఆఫర్. ఇదీ ఒక శుభవార్త అని చెప్పాలి. బంగారం ధరలు వరుసగా రెండవ రోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజు (గురువారం) తులం బంగారం
Gold And Silver Price: బంగారం కొనుగోలు చేసే వారికి బంఫర్ ఆఫర్(Bumper Offer). ఇదీ ఒక శుభవార్త అని చెప్పాలి. బంగారం ధరలు వరుసగా రెండవ రోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజు (గురువారం) తులం బంగారం రూ. 270 తగ్గింది. కానీ, నేడు శుక్రవారం ఏకంగా రూ. 540 వరకు తగ్గడం పసిడి ప్రియులకు శుభవార్త అని చెప్పాలి. పసిడి వరుసగా రెండో తగ్గుతూ రావడం విశేషం. ఏకంగా రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గింది. దీనికి కారణం..పెళ్లిళ్ంల సీజన్ కాదు..శుభకార్యాలు ఇప్పట్లో లేకపోవడమే బంగారం ధర తగ్గడానికి కారణాలు తెలుస్తున్నాయి.
ఇక వెండి ధర కూడా బంగారం బాటలో నడుస్తుంది. కాగా, దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు శుక్రవారం ప్రధానమైన నగరాల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామ్...
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,950 వద్ద కొనసాగుతుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,730
పసిడి ధర ముంబయిలో ఎలా ఉందంటే..22 క్యారెట్ల తులం బంగారం..రూ.46,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.50,730గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 51,380 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,270
కర్ణాటక రాజధాని బెంగళూరులో పసిడి..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,500 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 50,730గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లు అయితే..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,730గా కొనసాగుతుంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.4,500 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,730గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,730 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా తగ్గాయి..
దేశవ్యాప్తంగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. పసిడి బాటలోనే వెండి కూడా నడుస్తోంది. అయితే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం వెండి ధర రూ. 800 పెరిగి.. రూ. 51,600 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో రూ. 51,600, ఉండగా, తమిళనాడు రాజధాని చెన్నైలో అయితే.. కిలో వెండి ధర రూ. 58,000కాగా, బెంగళూరు రూ. 58,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రూ. 58,000 వద్ద కొనసాగుతోంది.
Updated Date - 2022-09-02T14:42:40+05:30 IST