నేటి నుంచి ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీఓ
ABN, First Publish Date - 2022-10-04T09:15:41+05:30
‘బజాజ్ ఎలక్ట్రానిక్స్’ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ద్వారా వివిధ కంపెనీల గృహోపకరణాలను విక్రయిస్తున్న ఎలకా్ట్రనిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ‘బజాజ్ ఎలక్ట్రానిక్స్’ బ్రాండ్ రిటైల్ స్టోర్ల ద్వారా వివిధ కంపెనీల గృహోపకరణాలను విక్రయిస్తున్న ఎలకా్ట్రనిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్ ఇష్యూ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. తాజా షేర్లను జారీ చేయడం ద్వారా కంపెనీ రూ.500 కోట్లను సమీకరించనుంది. పబ్లిక్ ఇష్యూలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఒక్కో షేర్ ధర శ్రేణిని రూ.56-59గా నిర్ణయించారు. ఇష్యూ 7న ముగుస్తుంది.
Updated Date - 2022-10-04T09:15:41+05:30 IST