అరబిందో షేర్లు... దారుణ పతనం...
ABN, First Publish Date - 2022-01-14T23:44:48+05:30
ప్రముఖ ఫార్మా సంస్థ అరవిందో షేర్లు దారుణంగా పతనమయ్యాయి. శుక్రవారం నాటి ఇంట్రా-డేలో అరవిందో ఫార్మా షేర్లు 5 శాతం క్షీణించి రూ. 684.50 కు రుకుంది.
హైదరాబాద్ : ప్రముఖ ఫార్మా సంస్థ అరవిందో షేర్లు దారుణంగా పతనమయ్యాయి. శుక్రవారం నాటి ఇంట్రా-డేలో అరవిందో ఫార్మా షేర్లు 5 శాతం క్షీణించి రూ. 684.50 కు రుకుంది. హైదరాబాద్లో తయారీ కేంద్రం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్(ఏపీఐ) యూనిట్ కోసం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యుఎస్ఎఫ్డీఏ) నుంచి హెచ్చరిక లేఖ అందిందని అరబిందో కంపెనీ వెల్లడించింది.
ఈ క్రమంలో... కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. కిందటి సంవత్సరం నవంబరు 10 న యూఎస్ఎఫ్డీఏ నుంచి సమాచారమందిందని, హైదరాబాద్లోని యూనిట్ I(ఏపీఐ) తయారీ కేంద్రంలో నిరుడు ఆగస్టు 2-12 మధ్య ఇన్స్పెక్షన్ జరిగిందని కంపెనీ వెల్లడించింది. ఈ చర్య నిరుడు ఆగస్టులో యూఎస్ఎఫ్డీఏ ద్వారా ఇటీవలి తనిఖీని అనుసరించింది. ఈ సదుపాయం నుంచి ప్రస్తుత వ్యాపారంపై దీని ప్రభావం ఉండదని కంపెనీ భావిస్తున్నట్లుగా అరబిందో ఫార్మా ఈరోజు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో పేర్కొంది. కంపెనీ ఇంకా రెగ్యులేటర్తో నిమగ్నమై ఉంటుందని, ఈ సమస్యను త్వరగా పరిష్కారం కావడం కోసం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపింది.
Updated Date - 2022-01-14T23:44:48+05:30 IST