ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5జీ కౌంట్‌డౌన్ షురూ.. ఆగస్టు నుంచే విస్తరణ మొదలు

ABN, First Publish Date - 2022-06-19T02:10:08+05:30

దేశంలో ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నుంచి 5జీ విస్తరణ మొదలై ఏడాది చివరి నాటికి 20-25 నగరాల్లో పూర్తి కానుంది. ఈ మేరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు నుంచి 5జీ విస్తరణ మొదలై ఏడాది చివరి నాటికి  20-25 నగరాల్లో పూర్తి కానుంది. ఈ మేరకు టెలింకం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విదేశాలతో పోల్చి చూస్తే ప్రస్తుతం దేశంలో డేటా సగటు ధరలు చాలా చవగ్గా ఉన్నట్టు చెప్పారు.  భారతదేశం 4జీ, 5జీ స్టాక్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ నెట్‌వర్క్‌లలో ప్రపంచానికి విశ్వసనీయ వనరుగా దాని స్థానాన్ని పెంపొందించుకోవాలని మంత్రి పేర్కొన్నారు  భారతదేశం అభివృద్ధి చేస్తున్న 4G, 5G ఉత్పత్తులు, సాంకేతికతలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అన్నారు. 


అయాచిత కాల్స్ సమస్యను పరిష్కరించేందుకు 5జీలో ఓ ముఖ్యమైన నియంత్రణ కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఎవరైనా కాల్ చేసినప్పుడు కాలర్ కేవైసీ గుర్తింపు పేరు కనిపిస్తుందన్నారు.  ఈ ఏడాది చివరి నాటికి కనీసం 20-25 నగరాలు, పట్టణాలలో 5G విస్తరణ ప్రారంభమవుతుందని తాను నమ్మకంగా చెప్పగలనని అన్నారు. అలాగే, డేటా ధరలు మన దేశంలో ఇప్పటికే చవగ్గా ఉన్నట్టు చెప్పారు.  

Updated Date - 2022-06-19T02:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising