ఉపాధి నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు: అమర్నాథ్రెడ్డి
ABN, First Publish Date - 2022-02-26T20:26:02+05:30
జగనన్న కాలనీల పేరుతో రూ.7 వేలకోట్ల ఉపాధిహామీ నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని టీడీపీ నేత అమర్నాథ్రెడ్డి అన్నారు.
అమరావతి: జగనన్న కాలనీల పేరుతో రూ.7 వేలకోట్ల ఉపాధిహామీ నిధులను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని టీడీపీ నేత అమర్నాథ్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఇంకా టీడీపీపైనే బురదజల్లితే ఎలా పెద్దిరెడ్డి? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగితే అధికారంలో ఉన్న మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని నిలదీశారు. తన అసమర్థత, వైసీపీ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ అవినీతి చేసిందంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరగకపోతే తక్షణమే రిటైర్డ్ జడ్జితో సీఎం జగన్రెడ్డి విచారణకు ఆదేశించాలని అమర్నాథ్రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2022-02-26T20:26:02+05:30 IST