వైసీపీ నేతల్లో అలజడి ..
ABN, First Publish Date - 2022-02-15T16:42:34+05:30
వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది నేతల్లో ఆందోళన మొదలైంది.
అమరావతి: వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న కొంతమంది నేతల్లో ఆందోళన మొదలైంది. న్యాయవాదులను సీబీఐ అరెస్టు చేయడంతో వైసీపీ సోషల్ మీడియాలోని కొందరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించిన కేసులో ఇద్దరు న్యాయవాదులు, ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ను సీబీఐ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అనేకమంది తాము పెట్టిన పోస్టులను తొలగించడమే కాకుండా.. సాంకేతికంగా తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.
Updated Date - 2022-02-15T16:42:34+05:30 IST