కైకలూరు ఎమ్మెల్యేపై అసమ్మతి నేతల ఆగ్రహం
ABN, First Publish Date - 2022-01-05T02:19:09+05:30
కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరావుపై వైసీపీ అసమ్మతి నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. కైకలూరు ఎమ్మెల్యే తన పదవిని అడ్డుపెట్టుకుని ..
కృష్ణా: కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరావుపై వైసీపీ అసమ్మతి నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. కైకలూరు ఎమ్మెల్యే తన పదవిని అడ్డుపెట్టుకుని రూ.250 కోట్లు అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు సేవనాగ జగన్ బాబురావు ఆరోపించారు. ఏపీలోని పలు నగరాల్లో నాగేశ్వరావు వందలాది ఎకరాలు కొనుగోలు చేసినట్లు వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ పాపారావుగౌడ్ తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వారిని నాగేశ్వరావు దూరం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-01-05T02:19:09+05:30 IST