వైసీపీ నేత దాష్టీకం..రామమందిరానికి తాళం!
ABN, First Publish Date - 2022-04-04T09:25:05+05:30
రామనవమి వేడుకల్లో తన కుటుంబానికి ప్రాధాన్యం దక్కలేదని ఓ వైసీపీ నేత రామాలయానికి తాళం వేశాడు.
శృంగవరపుకోట రూరల్ (జామి) ఏప్రిల్ 3: శ్రీరామనవమి వేడుకల్లో తన కుటుంబానికి ప్రాధాన్యం దక్కలేదని ఓ వైసీపీ నేత రామాలయానికి తాళం వేశాడు. విజయనగరం జిల్లా జామి మండలం అలమండలో ఆదివారం వెలుగుచూసిందీ ఘటన. గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా చేయడానికి ఆలయ కమిటీ, గ్రామపెద్దలు నిర్ణయించారు. కల్యాణ క్రతువులో పాల్గొనే దంపతుల పేర్లు ఇటీవల ఖరారు చేశారు. ఈ క్రమంలో స్థానిక వైసీపీ నేత, గ్రామ ఉప సర్పంచ్ లగుడు దేముడు తన కుటుంబ సభ్యులు కల్యాణంలో కూర్చుంటారని చెప్పాడు. అయితే, ఇప్పటికే దంపతుల ఎంపిక ఖరారైందని, మార్చడం కుదరదని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. దీంతో దేముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళమిచ్చిన తననే లెక్కచేయరా? అంటూ రామ మందిరానికి తాళం వేశాడు. మహిళలు నిరసన తెలపడంతో తాళం తిరిగిచ్చాడు.
Updated Date - 2022-04-04T09:25:05+05:30 IST