ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ‘అసమ్మతి’ నేత ఇంటిపై దాడి

ABN, First Publish Date - 2022-06-11T07:12:47+05:30

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ నాయకుడు బైసాని రాంప్రసాద్‌ ఇంటిపై దాడి జరిగింది. ఆయన ఇంటి కిటికీ అద్దాలను బద్దలు కొట్టారు. ఇది ఎమ్మెల్సీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిటికీ అద్దాలు ధ్వంసం.. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరులపై అనుమానం 


హిందూపురం టౌన్‌, జూన్‌ 10: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ నాయకుడు బైసాని రాంప్రసాద్‌ ఇంటిపై దాడి జరిగింది. ఆయన ఇంటి కిటికీ అద్దాలను బద్దలు కొట్టారు. ఇది ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అనుచరుల పనే అని రాంప్రసాద్‌ ఆరోపించారు. బైసాని రాంప్రసాద్‌ కుటుంబ సభ్యులతోపాటు బుధవారం బెంగళూరుకు వెళ్లారు. గురువారం తిరిగి వచ్చేసరికి  బెడ్‌రూమ్‌ కిటికీలకు ఉన్న అద్దాలు ధ్వంసమై కనిపించాయి. ‘‘ఇటీవల వైసీపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అసమ్మతి వర్గంతో కలిసి విజయవాడకు వెళ్లాను. నేను  కరస్పాండెంట్‌గా ఉన్న ఓ విద్యాసంస్థపై ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వద్ద ఉన్న ఓ వ్యక్తి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా విద్యా సంస్థకు ఆయన చెడ్డపేరు తెస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పాను. దీంతో... ఎమ్మెల్సీ వద్ద ఉన్న కొందరు నన్ను టార్గెట్‌ చేశారు. దాడి చేయడానికి వచ్చి...నేను లేకపోవడంతో అద్దాలు పగలకొట్టి వెళ్లిపోయారు’’ అని రాంప్రసాద్‌ మీడియాకు తెలిపారు. కొంతమంది నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు న్యాయం చేయాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరతానన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-06-11T07:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising