శ్మశానం గేటుకు అడ్డంగా గోడ.. వెలుగులోకి వైసీపీ కౌన్సిలర్ భర్త నిర్వాకం
ABN, First Publish Date - 2022-12-21T12:27:43+05:30
సత్తెనపల్లి వైసీపీ కౌన్సిలర్ భర్త నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. స్థానిక 12వ వార్డులో శ్మశానవాటిక గేటుకు కౌన్సిలర్ భర్త లోక మాధవ అడ్డంగా గోడ నిర్మించాడు.
పల్నాడు : సత్తెనపల్లి వైసీపీ కౌన్సిలర్ భర్త నిర్వాకం ఒకటి తాజాగా వెలుగు చూసింది. స్థానిక 12వ వార్డులో శ్మశానవాటిక గేటుకు కౌన్సిలర్ భర్త లోక మాధవ అడ్డంగా గోడ నిర్మించాడు. కోడెల హయాంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు. కౌన్సిలర్ భర్త నిర్వాకంపై మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే మునిసిపల్ సిబ్బంది మాత్రం ఈ ఫిర్యాదుపై స్పందించిన పాపాన పోవడం లేదు. గతంలో కూడా కౌన్సిలర్ భర్తపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2022-12-21T12:28:28+05:30 IST