నత్తనడకన రాయలసీమ ప్రాజెక్టుల పనులు: పీఏసీ కమిటీ
ABN, First Publish Date - 2022-01-22T23:28:20+05:30
రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని పీఏసీ
కర్నూలు: రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని పీఏసీ కమిటీ పేర్కొంది. ఈ విషయం పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, బనకచర్ల హెడ్రెగ్యులేటర్ సముదాయాన్ని పీఏసీ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించారు. తెలుగుగంగ ఆయకట్టు కింద ఉన్న రైతులకు రబీ సీజన్లోని పంటలకు సాగునీరు అందించాలని రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో కోర్టు స్టే ఇచ్చినప్పటికీ ప్రాజెక్టుల పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కమిటీ ఛైర్మన్ కేశవ్ కోరారు.
Updated Date - 2022-01-22T23:28:20+05:30 IST