సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్ తప్పనిసరి : జడ్పీ సీఈవో
ABN, First Publish Date - 2022-05-25T05:37:27+05:30
సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా యూ నిఫాం ధరించే విధులకు హాజరు కావాలని జడ్పీ సీఈవో ఏవీఎస్ఆర్ రవికుమార్ తెలిపారు.
కాళ్ళ, మే 24: సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా యూ నిఫాం ధరించే విధులకు హాజరు కావాలని జడ్పీ సీఈవో ఏవీఎస్ఆర్ రవికుమార్ తెలిపారు. మండలంలోని సీసలి, కాళ్ళ గ్రామాల్లోని సచివాలయాలను మంగళవా రం సందర్శించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి వారి శాఖలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలిసేలా సచివాలయంలో ప్రదర్శన చేయాలన్నారు. వివిధ పనుల నిమిత్తం సచివాలయంకు వచ్చే వారికి సక్రమంగా సమాధానం ఇవ్వాలన్నారు. ఎంపీడీవో స్వాతి, ఏవో ఎం.ప్రభాకరరావు, కార్యదర్శులు శివాజీ, బాలకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2022-05-25T05:37:27+05:30 IST