ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-08-15T05:22:32+05:30

భర్త, అత్త మామ, ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మృతదేహాన్ని పరిశీలించిన ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి ఆగస్టు, 14: భర్త, అత్త మామ, ఆడపడుచుల వేధింపులు తట్టుకోలేక మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉండి మండలం చిలుకూరులో ఆదివారం జరిగిన సంఘటన వివరాలు ఎస్‌ఐ గంగాధరరావు తెలిపారు. చిలుకూరు గ్రామానికి చెందిన బద్ది హరి సత్య నారాయణకు అనకాపల్లి జిల్లా మోటూరుపాలెం గ్రామానికి చెందిన సునీత(27)తో 2009లో వివాహమైం ది. వివాహ సమయంలో ఇచ్చిన సొమ్ము కాకుండా అదనంగా రూ.10లక్షలు తీసుకుని రమ్మని భర్త, అత్తమామలు వేధింపులు భరించలేక సునీత ఇంటి షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారికి 9 సంవత్సరాల కుమారుడు వున్నాడు. తల్లి విగతజీవిగా ఉండడం చూసి కుమారుడి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. బంధువులు, స్థానికులు బాలుడిని ఓదార్చారు. సంఘటనా స్థలికి చేరుకున్న ఎస్‌ఐ గంగాధరరావు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ రవిప్రకాష్‌, రూరల్‌ సీఐ అడపా నాగమురళి మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు సునీత తండ్రి నీరుకొండ నూకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్‌ఐ గంగాధరరావు తెలిపారు.

Updated Date - 2022-08-15T05:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising