గుర్తు తెలియని వృద్ధురాలి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-22T05:06:38+05:30
గుర్తు తెలియని ఒక వృద్ధురాలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.
ఏలూరుక్రైం, జనవరి 21 : గుర్తు తెలియని ఒక వృద్ధురాలు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఏలూరు రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏలూరు జూట్మిల్లు వెనుక రైల్వే బ్రిడ్జి కింద శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎన్.ఆదినారాయణ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలు సుమారు 60 ఏళ్ళ వయస్సు కలిగి 5.3 అడుగుల ఎత్తు ఉంది. ఆకుపచ్చ రంగు కాటన్ చీర, ఎరుపు రంగు జాకెట్టు ధరించి ఉంది. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు హెడ్ కానిస్టేబుల్ ఆదినారా యణ సెల్ నెంబరు 80740 55378కు సమాచారం అందించాలన్నారు.
Updated Date - 2022-01-22T05:06:38+05:30 IST