తెలంగాణ ఎంసెట్లో ఆసు హిందుకు 12వ ర్యాంక్
ABN, First Publish Date - 2022-08-13T05:43:05+05:30
తెలంగాణలో జరిగిన ఎంసెట్ పరీక్షల్లో శుక్రవారం ప్రకటించిన ఫలితాలల్లోనూ పెనుగొండకు చెందిన ఆసు హిందుకు రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంక్ను కైవసం చేసుకుంది.
పెనుగొండ, ఆగస్టు 12 : తెలంగాణలో జరిగిన ఎంసెట్ పరీక్షల్లో శుక్రవారం ప్రకటించిన ఫలితాలల్లోనూ పెనుగొండకు చెందిన ఆసు హిందుకు రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంక్ను కైవసం చేసుకుంది. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లోనూ ఆమె రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించిన విషయం తెలిసిందే. అటు తెలంగాణలోనూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు, పెనుగొండ వాసులు, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, సీఈవో భాష్యం హనుమంతరావు, ప్రిన్సిపాల్ అప్పారావు, జోనల్ ఇన్చార్జి ఎ.శ్రీమన్నారాయణరెడ్డి అభినందించారు.
Updated Date - 2022-08-13T05:43:05+05:30 IST