ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండుగడ్డి కొరత..

ABN, First Publish Date - 2022-12-12T00:23:13+05:30

ప్రతీ పంటలోను ఎండుగడ్డి మాసూళ్లు రైతు లకు సవాల్‌గా మారుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాదికి 17 లక్షల 33 వేల మెట్రిక్‌ టన్నుల గ్రాసం అవసరం

భీమవరం రూరల్‌, డిసెంబరు 11 : ప్రతీ పంటలోను ఎండుగడ్డి మాసూళ్లు రైతు లకు సవాల్‌గా మారుతోంది. ఒకవైపు పంట మాసూళ్లతో పాటు మరోవైపు పశువుల కోసం ఎండుగడ్డి మాసూళ్లు కత్తిమీద సాములా మారింది. తుఫాన్‌ కారణంగా కురి సిన వర్షాలకు చాలాశాతం ఎండుగడ్డి పొలాల్లో తడిచిపో యింది. జిల్లాలో 2లక్షల 16వేల 702 ఆవులు, గేదెలు ఉండగా ఏడాదికి ఎండి పశుగ్రాసంగా 17 లక్షల 33 వేల మెట్రిక్‌ టన్నులు కావాల్సి ఉంటుంది. ఈ ఏడాది రెండు లక్షల 52 వేల ఎకరా ల్లో సార్వా సాగు సాగాల్సి ఉండగా రెండు లక్షల రెండు వేల ఎకరాల్లో మాత్రమే సాగింది. ఇప్పటి వరకు మాసూళ్లు అయిన ఎండుగడ్డి నాలుగు నెలలకు మించి సరిపోదని రైతులు అంటున్నారు. గత పంటలో ట్రాక్టర్‌ ఎండుగడ్డి రూ.6వేలు ఉంటే ఈసారి రూ.8 వేల నుంచి రూ.10 వేలు వరకు అమ్ముతున్నారు. మిషన్‌ ద్వారా చుట్టిన మోపు రూ.35కు అమ్ముతున్నారు. తుఫాన్‌లు, ఆకాల వర్షాలతో ఏడాదిలో సార్వా, దాళ్వా, పంటల్లో సగం గడ్డి మాత్రమే మాసూళ్లు చేయగలుగుతున్నారు.

–––––––––

Updated Date - 2022-12-12T00:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising